పుట:Parama yaugi vilaasamu (1928).pdf/592

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాశ్వాసము.

575


కృపచేసి యటమీఁద నీశ్వరమునికి
సపరిమితౌదార్యుఁ డగుకుమారకుఁడు
యామునేయుం డనునతఁ డుదయించు
నామహాత్మునకు నేఁ ననువొంద నీకు
సవరించినట్టి యా సర్వార్థములును
వివరంబుగా నీవు వేసట లేక
యనువర్తనము సేసియైన నీవొసఁగు
మన విని రామమిశ్రాహ్వయుం డంత
నలయీశ్వరమునికి నాత్మజుం డెపుడు
గలుగునో యని కోరికలు గోరుకొనుచుఁ
దనగురుఁడొసఁగిన తత్త్వరహస్య
మనుభవింపుచు నుండె ననురక్తితోడ
నటమీఁద సింహముఖాంశసంభవుఁడు
పటుసత్త్వమయుఁడు శ్రీపతి కృపాయుతుఁడు
నీశ్వరముని కుదయించి తా శాశ్వ
తైశ్వర్యనంతుఁడై యామునాహ్వయము
నొనరంగ ధయించి యుపనీతుఁ డగుచు
జనకుండు వేదంబు చదువంగ నిడినఁ
జదువుచుం దొలినాఁడు చదివించుచదువె
చదువుమటన్న నాచార్యు నవ్వుచును