ఈ పుట ఆమోదించబడ్డది
564
పరమయోగివిలాసము.
అఖిలకళావేత్తయై సొంపు మిగిలి
యఖిలేశు యోగవిద్యాప్రభావమునఁ
దనరుధ్యానమునఁ బ్రత్యక్షంబ చేరి
కొని డెందమున నిడికొని యటమీఁద
నరయంగఁ బృశ్నిగర్భాంశ మైనట్టి
వరపుత్త్రు నీశ్వరాహ్వయమౌనిఁ గాంచె
నతఁడు దానును గూడి యష్టాంగయోగ
చతురకేళీవిలాసములఁ దేలింప
సారసమందిరాసహితుఁ డైనట్టి
నారాయణుండు ముందర వచ్చి నిల్చి
కనుఁగొని యొకకొంతకాలంబు జనఁగఁ
దనయుండు దాను నెంతయుఁ బ్రేమతోడ
నావీరనారాయణాధీశుఁ డైన
శ్రీవరుననుమతి క్షితిమీఁదఁ గలుగు
హరిమందిరంబులు నచటితీర్థములుఁ
గరమర్థి సేవింపఁగాఁ గోరి కదలి
దనుజారిసదనతీర్థముల మూడేసి
దినములు నిలిచి వర్తించుచు నచటఁ
జెలువొందుమూర్తుల సేవించికొనుచుఁ
జెలఁగి భూమికిఁ బ్రదక్షిణము గావించి