ఈ పుట ఆమోదించబడ్డది
558
పరమయోగివిలాసము.
నలనందసుతునకు నర్పించి యచటి
కలధౌతమణిమయాగారంబునందు
వరవైభవముల నవ్వసుదేవతనయుఁ
దిర మొందుప్రేమఁ బ్రతిష్ఠఁ గావించి
జనులెల్ల వినుతింప సంబంధు వీడు
కొని కవి శేఖరు ల్గొలిచి యేతేర
పరకాలు మిగుల సంభావించి రంగ
పురమున కనిచె నప్పుడు పరాంతకుఁడు
శ్రీరంగమున కేగి శ్రితకల్పతరువు
శ్రీరంగనాథుని సేవించి యంత
గట్టిగాఁ దా మున్ను గరశానములను
గట్టించినట్టిప్రాకారముల్ చూచి
నలువార నల్లసేనపుజంగరాల
నెలమి నీసాలంబు లేను గట్టింతు
నని విన్నవించి యే నట్ల యీడేర్చి
తనయంబుఁ గరుణించి యప్పుడ యేను
గట్టిగా మంచిబంగరునీలమణులఁ
గట్టింతు ననిన యాగతిన యీడేర్తు
నీరీతి విన్నపం బేలకో యపుడె
శ్రీరంగనాయక సేయలేనైతి