పుట:Parama yaugi vilaasamu (1928).pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

532

పరమయోగివిలాసము.


పుడమి వారలనెల్లఁ బ్రోచి మాతాత
గడియించినట్టి దీకాణాచి నేల
యన్యాయ మేటికి నడుగుము నాదు
మాన్యంబు గాని సామాన్యంబు గాదు
తుదిని యీ యూ[1]రను దొరరెడ్డి వేరె
మదిఁ గొంక కొండొరుమాన్య మీరీతి
దున్నెడిలా గెట్లు తొలఁగు నీపనులు
విన్నార మేల క్రొవ్వితి కాఁపువాఁడ
కేనమేటికిఁ గందిగింజను గాఁపు
వానిని వేచకెవ్వలఁ జవి గాద
యనుమాట నిజమయ్యె నని వాఁడుఁ దాను
ననయంబు గినిసి వా దడచి యామీదఁ
దగవున కొప్పి యిద్దఱు నేగుదెంచి
తగవువారలతోడఁ దమపను ల్నొడివి
కట్టకానుక లిడి కడపట నిలువ
గట్టిగా నాకార్యగతి విచారించి
యలయున్న సభవార లాయిరువురను
బిలిచి పరాంతకుఁ బిలిచి యిట్లనిరి
యరయంగ నీమాన్య మైనయందులకుఁ
బరగంగ సాక్షిసంబంధంబు గలదె


  1. రిని