పుట:Parama yaugi vilaasamu (1928).pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము.

267


సొరిది మరందంబుసోనలు గురియు
సురపొన్ననీడ భాసురముగా నొకటి
సవరగా నడుమను జవికె గావించి
[1]బవరిగా దట్టంపుఁబందిలి వెట్టి
యినుఁ డుదయించునయ్యెడ మేలుకాంచి
తనయనుష్ఠానంబుఁ దప్పక తీర్చి
మనురాజ మైనట్టిమంత్ర మెన్నుచును
ఘనమైన పూవులకరడి గీలించి
యరిగి యవ్వనములో నందంద తిరిగి
యరవిరు లైయున్న యట్టిసూనములు
ననిచి గోదుమగింజ ననలొత్తుతులసి
దినదినంబును గోసితెచ్చి వేర్వేఱఁ
జినుగకుండఁగ నీరు చిలికించి తొలఁచి
పనుపడఁ గదళికాపత్త్రముల్ పఱచి
యందుమై వేర్వేఱ నావిరు లునిచి
పొందుగా మునుమున్నె పోఁజినయట్టి
నార చెన్నార సన్నంబుగాఁ జీరి
చేరువఁ దా సుఖాసీనుఁడైయుండి
బొటవ్రేల దర్జనిం బూవులు రెండు
నటన గీలించి లో నార సంధించి


  1. సవరణ పందిలిఁ జక్కగాఁ జేసి