ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము.
249
పరునొల్ల నల పరాత్పరుఁ డైన రంగ
వరుని నావరునిగా వరియింపవలయు
నన విని కడు వెఱఁగంది యారాజు
తనుజాతఁజూచి పద్మజభవాదులకుఁ
జర్చింపఁగా నగోచరుఁడైన విష్ణు
నర్చావతారుని నారంగధాముఁ
గోరుటయెట్లు నీకోరినయట్ల
కూరిమితోడఁ జేకూర్చుటయెట్టు
లిలలోనఁ బసిబిడ్డ లెఱుఁగమిఁ బిలిచి
యల చందమామ వెన్నడిగిన ట్లయ్యె
నని విచారముసేయునపుడు విన్వీధిఁ
గనకాద్రి నీలశృంగము వొల్చినట్లు
పసిఁడిరెక్కల తేజిపై నెక్కి రంగ
వసుధేశుఁ డఖిలదేవత లెల్లఁ గొలువ
నరుదెంచి ప్రత్యక్షమై రాజుఁ బిలిచి
కరమర్థిఁ బద్మినీకన్య నిమ్మనిన
జననాథుఁడెంతె విస్మయమంది రంగ
జననాధుపాదకంజముల మైవ్రాలి
రంగ! పక్షీంద్రతురంగ! వేదాంత
రంగ! సత్కరుణాంతరంగ! యభంగ!