పుట:Parama yaugi vilaasamu (1928).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

205


పాదుక లొసపరి బాగుగా మెట్టి
కైదండ యొకపద్మగంధి గావింప
సరవిమై మజ్జనశాలచెంగటికి
నరిగె నంతట మల్లు లరిగి [1]రిండులకు
నక్కడనున్నట్టియాభరణములు
బొక్కసంబులవారు పోలించి చూచి
యీయెడ భూనాథుఁ డేటికిం బెట్టి
పోయెనో యనుమతంబునఁ గాని తమకుఁ
బట్టరా దని భయపడి యేగి రతని
కట్టడ నెఱిఁగి యక్కడ నుండ వెఱచి
తదనంతరమున నద్దరణీశ్వరునకు
నొదవువేడుక నొకానొకవిన్నపంబుఁ
గావింతు మని దైవికంబున మంత్రు
లావేళ వచ్చుచు నచ్చోట నున్న
సొమ్ములు చూచి యాచుట్టు నొండొరుల
త్రిమ్మట లేనియత్తెఱఁగు వీక్షించి
యేకాంత మయ్యెఁ బో యీవేళ మనకు
భూకాంతు వేడబంబుల నోసరింప
వసుధేశునకు వైష్ణవభ్రాంతి వట్టి
వసుధరాజ్యంబు నెవ్వరి సడ్డఁ గొనఁడు


  1. రింటికిని