నాయకురాలు
67
ముందు మన్వాది మహర్షు లేలపనికివస్తారు ? చెట్టు చెడు కాలమున కీ కుక్కమూతిపిందెలు. దేశాన్ని పంచుకొని తినే పాలకులు, స్వార్థపరులై పరులనాశ్రయించి పైకి రా గోరే ప్రజలు. దేశ మీ దుర్గతికి వచ్చింది.
ఎందుకీ గంట? ఎవరురా అది ?
నౌకరు : ( ప్రవేశించి) సహాయమంత్రిగారు అగత్యముగా తమతో మాట్లాడగోరుతున్నా రు.
నాయ : ఇప్పు డెంతపొ ద్దయినది ?
నౌక : తోలికోడి కూసింది.
నాయ : మెల్లాలోకి తీసుకొనిరా. ( ఇద్దరు వెళ్లుతారు)
( నాయకురాలు, నరసింగరాజు ప్రవేశము )
నాయ: రాజుగారూ ! దయచేయండి. తమకు నిశాచరత్వ మబ్బినట్టున్న దే?
నర : సాహచర్యదోషం.
నాయ : నాకు ఈ రాత్రంతా అనిమిషత్వ మబ్బిందిగాని రాత్రించరత్వం పట్టలేదే !
నర : నిశాచరులూ ఒకప్పు డనిమిషులే. ఈ రాత్రి నాకు రెండుగుణాలూ ఏకకాలమందే పట్టుబడ్డవి. రాత్రి గంగవరం బోయి కట్టుబోతును పట్టుకొని వచ్చా. వాడి మాయకోడిని యాభై మొనగాడికోళ్ల మీద వదిలి చూశా. ఒక్కొకదానికి అయిదునిమిషాలు పెట్టలేదు. వరుసగా నరికి పోగులు బెట్టింది.