122
నాయకురాలు
[ ఝట్టి తెరలో ]
కోటకేతురెడ్డి మరలించినా మరలక సైన్యములు విరిగినిర్వీర్యమై పారిపోతున్నవి. ఆహా ! నరసింగభూపతి వీరస్వర్గము నందినాడు.
నల. రా : అయ్యో ! తమ్ముడా! నాయందే నీ ప్రేమంతా వుంచి లక్మణుడు శ్రీరాముని గాచినట్లు న న్నింతవరకు కాచి, రక్షించి న న్నిపుడేల విడిచిపోయినావు? నీవు లేని రాజ్యము నా కెందుకు? నీకై పోరాడబోయిన నాయకురాలికి బాసటై శత్రుసంహారము గావించి నీ ఆత్మసంతృప్తి గలిగింతునుగాక !
ఝట్టి : ( ప్రవేశించి) అన్నయ్యా ! నీ విక్కడనే వుండు. నేను నాయకురాలికి తోడై చినఅన్నయ్యకు దుర్మరణము గలిగించిన యా హంతకుల నంతమొందించి వస్తాను.
నల. రా : తమ్ముడా ! అనాథయై వున్న పల్నాటిరాజ్యమునకు నీవే అధిపతివి గమ్ము. ఇచ్చటనే వుండుము. తమ్ముడు లేని రాజ్యము నాకేల?
ఝట్టి : కాదన్నయ్యా ! నే బోతాను.
నల. రా : వద్దు. ఇది నా యాజ్ఞగా శిరసావహించుము.
ఝట్టి : వద్దన్నయ్యా.
నల. రా : అసహాయుడనై వున్న నా ఆజ్ఞను నీవూ పాలించవా?
ఝట్టి : చిత్తము. మీ యాజ్ఞ శిరసావహిస్తాను.
నల. రా : ఎవడురా! తేరు....
[ నిష్క్రమణం ]