పుట:Naatyakala maasapatrika, sanputi 1, sanchika 2, april 1935.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా ట్య క ళ

        ఈ ప్రదర్శనము దీర్ఘసత్రముగా సాగెను.  చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు పరీక్షకులలో నొకరు.  వరే ధన్యులు. ఏలనగా వారికి కనులు లేవు.
    మా కవి ఆనందదినములు, రాత్రిబారువంతయు పగలు పోయెడిది.  పరీక్షలకు లగు వడ్డాది సుబ్బారాయుడుగారును, చిలకమర్తి లక్ష్మీనరసింహముగారును, హరినాగభూషణముగారును, నేనును ఒకచోటనే బస. నేతి సోమయాజులుగారు మమ్మంటుకొనియుండువారు.  లక్ష్మీనరసింహముగారొక హాస్యతరంగమును లేవదీసేడివారు.  వడ్డాది సుబ్బారాయుడుగారికి ఎన్నెన్ని గ్రంధములలో ఎన్నెన్ని పద్యములు వచ్చునో అంతుదొరికెడెదికాదు.  నేనును వీరినడుమ ఆసులో కండెవలె ఆడుచుండేడివాడను.  హరినాగభూషనముగారికి మాకంటే పాట యొకటి పెచ్చు. ఈ పగటినాటకములకు టికెట్టులేకపోవుటవలన రాత్రి నాటకములకంటె వీనియందే జనసంఖ్య హెచ్చు.
     ఈ పరీక్ష బెజవాడలో అచ్ట కొక్ందఱనటులమీద కొందఱ కసూయ.  ఫలావారిని మీరు ప్యాసుచేయించుచో  మె బుర్ర రామకీర్తన పాడింతునని ఆకాశవాణీ పలికెను.  నేను దానిని లెక్కచేయలేదు.  నాది పదునెనిమిదేండ్ల ఉడుకుపాలు. మిగిలినవారందఱది  చల్లాఱినపాలు.  వా రాలోచించిరి.  ఇంతలో ఆకాశవాణి ఆకాశధ్వనిగా మాఱెను. పెండాలురేకులమీద రాళ్లవాన కుఱియదొడిగెను.  మాలో పెద్దలు మంచిమాట చేసికొనుటకు నన్నొకమూలకు గొంపోయిరి.  కాని లాభము లేకపోయెను  వోటింగు పెట్టి నాపుడు నెత్తిమీది ఆపాయము తొలగించిరి.  నాట్యకళ అపు డిటులు అభివృద్ధి పొందెను.
                                   పి ద ప
    నే నొకనాడు రైలుప్రయాణము చేయవలసివచ్చెను.  రైలులో ఎక్కడను చోటులేదు.  దీనికి కారణము బెజవాడలో సావిత్రి ! దాని కీజన ప్రవాహము.
      నే నీనాటకము చూడుభాగ్యమును బడయనైతిని.  ఈ నాటకమున వేషము ధరించిన సంజీవరాఆదుల పే రాంధ్రలోక మెఱిగినదే.
   తరువాత కొన్నియేండ్లకు స్థానం నరసింహారావుగారిని రంగస్థలమున హఠాత్తుగా చూచుట తటస్థించెను. అపుడు నాకనులు మూతలుపడలేదు.