116
మహర్షి దేవేంద్రనాథఠాకూర్ స్వీయచరిత్రము,
హే ! పరిపూర్ణజ్ఞానముయా ! నిత్యనూతనమై, శుభ్రజ్యోతిర్మయ మైన నీసత్యము నాచిత్తాకాశమందు ఎప్పుడు ప్రకాశితమగును?
ఉర్ధ్వముఖముతో, జోడితహస్తములతో, నవ సౌఖ్యము, నవప్రాణము,
నవారుణోదయముల కొరకు దీర్ఘ నిశీయుతయు ఉదయదిశ వంక
చూచుచు కూర్చుండి యున్నాడను. ఏమిచూతునో ? ఏమి తెలిసి కొందునో?
ఆ రానున్న యానంద మేదియో తెలియదు.
నాహృదయాంతరాళమున నొకనూతన కాంతి. ఆ కాంతి సహాయముతో,
అత్యం తానందముతో గీతముల పాడుకొనుచు నింటికి పోవుదును.
దుర్భరమగు పరవాసజీవనము గడపుచునుండ నేవరిచ్చగింతురు! –
ఈ సమయమునందీ యాశీర్వచనము నాహృదయములో ప్రవేశించెను.
“స్వ స్త్రీవః పారాయతమసః పరస్తాత్" ఈయజ్ఞానాంధ కారసంసారము యొక్క పరకూలమున బ్రహ్మలోకమునకు పోవుమార్గము నీకు నిర్విఘ్నమగుగాక ! ఈఆశీర్వచనము పొంది ఈపృధివిలో నుండిశాశ్వత బ్రహ్మలోకము ననుభవింపగలుగుదును.
ఇరువదిమూడవ ప్రకరణము.
బాహ్మసమాజికులకందరకు ఏక స్థానమేది ? ఇదియే ఇప్పుడు నాఆలోచన. తంతము, పురాణము, వేదము, వేదాంతము, ఉపనిష త్తులు, ఇవేవియునుకూడ బ్రాహ్ములకు ఏక స్థానము కాని, బ్రాహ్మధర్మమునకు పునాదిగాని యొసగజాలక పోయెను. బ్రాహ్మధర్మమున కొక బీజమంతము (Creed) ఉంవ లెననియు ఆబీజమంత్రము బాహ్ములకందరకు ఏక స్థానమగుననియు నిశ్చయించికొంటిని,