పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాజుల లక్ష్మీనర్సు శెట్టి

259



రము నంగీకరించుటయో లేక నిజామున కందులో భాగము పంచి పెట్టుటయో రెంటిలో నేదో యొకటి చేయవలసివచ్చినందున రాజునకు సంస్థానమిచ్చుట యెక్కుడు గౌరవమని దత్తతపుత్రుఁడు యుక్తవయస్కుఁడైన పిదప రాజ్యమిచ్చు నట్లొప్పుకొనిరి. శెట్టి జానుబ్రూసు నార్టనుదొరగారితో గలసి రాజ్యభ్రష్టుడైన తంజావూరి మహారాజు భార్యల దురవస్థను గొంతవఱకు చక్కపరచి మృతినొందిన కర్నాటక నవాబుయొక్క కుటుంబ మనుభవించు కష్టములను జాలవరకు తగ్గించెను. ఈ పనులు 1864 వ సంవత్సరమున జరిగెను.

అప్పటికి శెట్టిభాగ్యముక్షీణించెను. క్రెసెంటుపత్రిక నడపుటకే వాని ధనమంతయు వ్యయ మయ్యెను. అతఁడు తన వ్యాపారము కుమారున కప్పగించుట చేత వాని తెలివితక్కువవలన నది బొత్తుగ చెడిపోయెను. కావలసిన ధనము లేమి క్రెసంటుపత్రిక ప్రకటింపఁ బడుట మానెను. అది మొదలుకొని లక్ష్మీనర్సు శెట్టి జీవితకాల శేషము పేదయైగడపెను. ఆయన 1868 వ సంవత్సరమున మృతినొందెను. ఆయన దేహము నశించినను కీర్తిదేహమిప్పటివఱకు దక్షిణ హిందూస్థానముననున్నది. ఆయన మృతినొందిన కొన్నినాళ్ళకు చెన్నపురి మహాజనులు పచ్చయ్యప్పగారి పాఠశాలలో సభగూడి వానిమరణమునకు మిక్కిలి విచారించి వానిపేరు చిరకాలము జ్ఞాపకముండుటకు వాని బొమ్మయొకటి నిర్మింపఁజేసి యది యా పాఠశాలలో బెట్టుటకును ప్రసిడేన్సీ కాలేజీలో సంస్కృతము జదువుకొను బాలురలో సూక్ష్మబుద్ధి గలవానికి నెలకు కొంతసొమ్ము విద్యార్థి వేతనముగ నిచ్చుటకును గృతనిశ్చయులైరి. ఆరెండు కార్యములకుఁ గావలసిన ధనము నాకాలపు గొప్పవారంద ఱిచ్చిరి. తిరువాన్కూరు మహారాజుగారు, వారి మంత్రి సర్. టి. మాధవరావుగారు శెట్టిగారి మరణమున దమకుఁ గలిగిన సంతాపము నెఱిఁగించుచు గొంత చందాసొమ్ము