పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
253


బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు

ఆరయఁ దొంటి కాలమున నత్తయుఁ గోడలు గూడిమాడి మా
భారత జాతికెల్ల బహు భంగుల వన్నె యొసంగి రిప్పుడా
కూరిమి వీడి యత్త కడుఁ గొండిక చూపునఁ జూచుచుండినన్
భారతి మాత్రమెంతయుఁ గృపారతి నున్నతి నిల్పుచుండెడిన్

నాల్కతుదన్నిరంతరము నాట్యము సల్పుట కీ సహోదరుల్
పల్కు వెలందినట్లు తొలి బామునఁ గొల్చిరొ తేట తేనియల్
చిల్కినయట్లు విందొసఁగుఁ జెప్పిన పద్దెము లెల్ల వహ్వరే
పల్కిన పల్కులన్నియును బద్దెములయ్యెడు నేమి చెప్పుదున్.

ఆలోచించుట లేదు కల్పనకుఁ బద్యారంభ యత్నంబు ము
న్నే లేదించుక ప్రాసకేని యతికేనిన్ గొంకు కన్పట్టదే
యాలస్యంబును గల్గఁబోదు బళరా యయ్యారె యివ్వారికిన్
బాలేయౌఁ జుమి యాశుధార కవితా ప్రారంభ నిర్వాహముల్.

అమితాశ్చర్య శతావధాన రచనాత్యాశు ప్రబంధోక్తి ని
స్సములౌ తిర్పతి వేంకటేశ్వరులకున్ సంతోషముం గూర్చు భ
వ్య మహా శక్తులు వీరలాశు కవితోద్యద్రాజ పట్టాభి షే
కము నందందగు నట్టి దిట్టలని వక్కాణింతు నిక్కమ్ముగన్

బహ్మశ్రీ ఆశుకవి చెన్నాప్రగడ భానుమూర్తి పంతులుగారు - మాలిక

వరహిమశైల నిస్సరదవారితగాంగ ఝరావతారజి
త్వరమయి, పద్మ భూవదన భాసుర రంగ నట త్సరస్వతీ
చరణసునూపురారసిత చారుతరంబయి తత్కరాంబుజా
గ్రరుచిర రాజకీర మధురస్పుట వాగ్విసరాను కారియై
యరిమురి బారుమీదు కవితామృతధారలఁదోఁగుమాకు నీ