పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

యగుట హనుమత్సుధీంద్రు సర్దాంగలక్ష్మి
రత్నమాంబిక స్త్రీజనరత్నమండ్రు

కర్ణతుల్యవదాన్యతా పూర్ణుఁడగుటఁ
గర్ణభూషలనప్డిడి గణ్యమైన
సభ యొనర్పింప మఱియొక్క సారిపల్కె
సీతమాపతి సుబ్బార్య శేఖరుండు

అంతభగవత్బుధాగ్రణి హర్షరాశి
మమ్ముఁగనిపల్కెనిట్టు లస్మద్ధితులగు
తడికమళ్లాన్వవాయు లుత్తములు లక్క
వరమునంగల్గిరట కేగవలయుననుచు

అనియటకుఁ బంపఁ దలఁపో
సిన భగవత్సుగుణి హృదయసీమఁ బ్రమోదం
బెనయఁగ నప్పురిఁ గల రా
జన యను నల తడికమళ్ళ సత్కులుఁడర్ధిన్

పరువడిభామ యాదులగు బంధులుసద్గుణసింధులెన్నఁగా
నరుదగు వస్త్రగౌరవము లందఁగఁజేసి మహాక్షయుగ్మసుం
దర శకటంబునం బనిచినన్ శుభవాద్య నినాదమొప్పఁ న
ప్పురమునువీడి లక్కవరమున్ వరమోదనిరూఢిఁజేరుడున్

అలకామవరకోటఁ గలచిన్నరాజాలు
         శకటంబునెక్కిరా సంతసించె
భగవద్దనుమ దార్య భామయార్యాదుల
         సత్కార్యములకు హర్షమువహించెఁ
దననూత్న సౌధమందున సమర్హాసనో
         త్తమశయనాది మోదముల నించె