పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాల]

స్వాతంత్ర్య రథము

35


లేవు దివ్యతురంగముల్, లేవు కరులు,
ప్రజలె యాతేరుమోకులఁ బట్టువారు;
వాయుజవమునఁ దారకాధ్వమున నేఁగు
నంతరాయశతంబుల నైన దాఁటి.

తేరుజాడల నెత్తురు పాఱిపాఱి
బంగరుంబంటఁ బండించె బక్క నేలఁ;
జక్రనేములు దాఁకిన స్థలములెల్ల
సస్యలక్ష్మికిఁ గళ్యాణశాల లయ్యె.

స్యందనాసీన యగుదేవి 'శాంతి శాంతి'
యనుచు మంజులగానమ్ము నలరఁజేసి,
నవ్యనక్షత్ర వీణాస్వనమ్ములందు
మేళవించెను జనులు విస్మితులు గాఁగ.