మాల]
రెడ్డికులప్రబోధము
25
ఆంధ్ర వీరాంగన యైన నాయకురులు
మన కులస్త్రీ యన్న మాటచాలు
ఔదార్య ధుర్యాత్ముఁ డనవేమ భూపుఁడు
మావాఁడె యన్న సంబరముచాలు;
నింక నెందఱెందఱనో యహీనయశులఁ
గాంచి లోకైక విఖ్యాతి గన్నయట్టి
రెడ్డికులపుఁ జారిత్రంబు శ్రేష్ఠమనుట
కేమి లోపంబుగలదు? మీరెఱుఁగరయ్య.
ఘనసైన్యంబులఁగూర్చి, బాహుబల విక్రాంతి న్విశేషించి ప
ద్మ నృపాలాళికి గుండెగాలముగ, విద్యానాథులై కొండవీ
టను నద్దంకిని రాణ్మహేంద్రపురిఁ గోటల్గట్టి శౌర్యంబునన్
మును బాలించిన రెడ్డిరాజుల యశంబుల్ నేఁటికిం గ్రాలవే?
మార్తుర రాజ్యరమామణుల్ చెఱఁబడి
గోడుగుడిచిన చోటు కొండవీడు;
ఆంధ్రదేశ మతల్లి యలికంబునం దాల్చు
మండన తిలకంబు కొండవీడు;
కవితారసాలోల కల్లోలినిం దోఁగు
పండితాఢ్యుల నాడు కొండవీడు;
ఖండితారాతిరాణ్మండన మండితా
ఖండలచాపంబు కొండవీడు;