హైమవతికథ
67
ఆ దెబ్బలకుఁ దాళలేక యతం డుచ్ఛస్వరంబున జనకుంజీరి "తండ్రీ! నేను చిరకాలమునకు నీయొద్దకు వచ్చినందులకు మంచిశిక్షయే చేయించుచుంటివి. వీరు నన్నూరక బాదుచున్నారు కటకటా! కన్నతండ్రివి నీకైన నక్కటికములేదా! నా కేమియు బిచ్చియెత్తలేదు. భూతము సోకలేదు. నామాటలు మీరు తిన్నగా నర్థము సేసికొనలేక అట్టి భ్రమపడుచున్నారు ఇంతకును కారకురాలు నాయాలు నేను స్వస్థ చిత్తుడనై యుంటిని నామాటలన్నియు మీరు సావకాశముగా విని తరువాత బ్రతిక్రియజేయుడు. మీకు దెలియనిచో నామిత్రుడు సుమిత్రు నొక్కసారి యిచ్చటికి రప్పింపుడు . వాని కన్నియుంజెప్పి యొప్పించెద"నని కన్నుల నీనుగ్రమ్మ దైన్యముగా బలుకుచున్న పుత్రకునిఁ జూచి తండ్రి శోకించుచు నాక్షణమునందే సుమిత్రుని రప్పించి అతనితో నిట్లనియె.
సుమిత్రా! నీమిత్రుని అవస్థ యెట్లున్నదియో చూడుము. మాటలు దేటగానే యాడునుగాని మనకేమియు నన్వయింపవు నీతో నెద్దియేచెప్పియొప్పించునట. వాని మాటలువిని మాకుఁ జెప్పుము; అని పలుకుచు నతనిని జయభద్రుడున్న గదిలోని కంపెను.
సుమిత్రుని జూచినతోడనే జయభద్రుడు మిక్కిలి సంతసించుచు పెద్దతడవు గాఢాలింగనము జేసికొని కనుల నానందభాష్పములు గ్రమ్మ నతనితో నిట్లనియె.
వయస్యా! నేను నీమాటలు వినకపోవుటచేఁ బెక్కిడుమలంబడితిని. దైవకృపచే నవియన్నియుం దాటి నేఁటికి సంతోషముతోఁ గన్నవారున్నవారుకదా అని యిచ్చటికి వచ్చితిని. వీరిఅభిప్రాయ మెద్దియో నాకుఁ దెలియకున్నది. నామాటలు విని వీనికిఁ బిచ్చియెత్తినదని కొంతసేపు నన్ను నిర్భంధించుచున్నారు. ఈ భూతవైద్యులు నన్నెట్లు బాదిరో చూడుము నావృత్తాంతమంతయు నీకుజెప్పెదను. విను మని తాను బోగముదాని యిల్లు విడువకుండుటయు నది దొంగలచే దన్ను నూతిలో బారద్రోయించుటయు నందు హైమవతితో గలసికొనుటయు నామెతోగలసి యమరావతికిఁ బోవుటయు నచ్చట ధనవర్మగుణవర్మల మాయోపాయముచేత సంహరించుటయు శూరపాల వీరపాలుర వధ, హైమవతి పరిణయము, తసపట్టాభిషేకము మొదలుగాగల కథఅంతయుంజెప్పి నామాటలలో బిచ్చి యెచ్చటనున్నది? కావలసిన యెడ నమరావతికిఁబోయి నేజెప్పిన విషయములన్నియు నరసికొనిరమ్మని నిగూఢముగా వక్కాణించెను.
అతని వృత్తాంతమంతయును విని సుమిత్రుడు విస్మయాకులచిత్తుండై అమరావతిలో జరిగిన చర్యలన్నియు నంతకుమున్న తానుగూడ వినియున్న కతంబున నట్టిపని చేసినవాఁ డితడగునో కాడో అను సందియము డెందమున కెఱింగించెను.
అప్పుడతండు సుమిత్రునింజూచి ఆతనిమాటలు నీ వెట్లు నమ్ముదువు? ప్రతిదినము ఈతని నిచ్చట మనము జూచుటలేదా ? కన్నులారా చూచుచున్నవాని నెట్లు