106
కాశీమజిలీకథలు - మూడవభాగము
గీ. తేనెబూసినకత్తియల్ తెఱవ లరయ
ఘనతృణచ్ఛన్న కూపముల్ కాంతలెన్న
నిల పయోముఖవిషకుంభములు లలనలు
మేకవన్నె పులుల్ గదా మెలఁతలహహ
చ. పిడుగరచేతబట్టి వెఱపింపగవచ్చును కాలకూటమున్
గడగడఁ ద్రాపవచ్పు నురగంబు శిరంబున జుట్టవచ్చుఁ బెం
పుడుగక సింహకేసరము లుయ్యెలలూగకవచ్చుఁగా కిలన్
బడతుల మాయలం దెలియ బ్రాహ్మకుశక్యమె వాని అబ్బకున్.
నేను స్వయంవరము చాటించి రాజకుమారుల రావించిన నొకనిని వరించినది కాదు . ఇప్పుడిట్టి వార్త నాకు దెలియవచ్చె నింతచంచలచిత్తురా లేమిటికి బెండ్లియాడకుండవలయును? నిష్కళంకమైనకులము కళంకపఱచుటకేకదా. కానిమ్ము- అట్టి గూఢపురుషునిం బట్టుకొని యెదురంబెట్టి అడిగెను. వచ్చిన అపకీర్తి పోదుకదా అని తలంచి యకకింకరులవంటి పరిచారకుల నామందిరము చుట్టును కావలియుంచి విమర్శింప నెప్పటికి నేజాడయు దొరకినదికాదు.
అప్పుడు రాజావార్త శత్రువులెవ్వరో అట్లు తెలియజేసిరేమో అని సందియ మందుచు భార్యంబిలిచి నీ కూతురు మంచినీచిశాలిని యయ్యె, లోకవార్త చెడుగుగా నున్నది నిజమరసిరమ్మని పంపిన నామెయు నంతకుమున్ను దానును వినియుంటి నని చెప్పి పతికి నీతివాక్యములుపదేశించుచు గోపోపశమనము గావించినది.
తరువాత నతండు తనకత్యంత ప్రియుడైన మంత్రితో రహస్యముగా నా వర్తమానము జెప్పి ఆప్పురుషునింబట్టి యిమ్మని అడిగెను .
బుద్ధిమంతుడైన అమ్మంత్రియు నంతఃపురచారిణి వసంతిక అనుదానింజీరి శుద్దాంతతంత్రము లన్నియుం గ్రహించి కుందనపురేకులం దిలలంతలేసి కొట్టించి మనోరమ మేననలందుకొను గంధములో గలిపి రమ్మని రహస్యముగా నవ్వసంతికను నియమించిన నొకనాడది అట్లుచేసినది. పాముపాదములు పాముకేకాక యితరులకు దెలియునా! వసంతికకు మధురికయందు వైరము గలిగియున్నది. దాని మూలముగా నాగుట్టంతయు నది బయలు పెట్టినది.
ఆతంత్రమేమియు గ్రహింపక మనోరమ, యారాత్రి కందర్పుని మేన నాగందముబూసినది. అతండు నావ్యత్యాయము గ్రహింపలేకపోయెను. మఱియు యారాత్రి అంతయు అందుండి ఆతండు సూర్యోదయము కాక పూర్వము లేచి గగనముపై కెగసి యాయూరికి దూరముగానున్న యొక చెరువుగట్టున వ్రాలి యాజింక అందున్న చెట్టు కొమ్మల దగిల్చి తాను దంతధావనము జేసికొనుచుండెను.
అప్పుడు మంత్రి శాసనంబున నట్టివానిం బట్టుకొనుటకయి నలుమూలల