పుట:Jeevasastra Samgrahamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాప్తి.

కొన్ని జనుల కుపయోగమైనవియు గలవు. ఇందునకు తార్కాణముగా జనపు పైరుబెట్టిన భూమికి సత్తువ గలుగుట యీ సూక్ష్మ జీవులమూలముననే అని తెలియవలయును. ఇవి యా మొక్కల వ్రేళ్ల నాశ్రయించియుండి మొక్కలకు కొంత నత్రజనసంబంధమైన యాహారమును గాలిలోనుండి సంపాదించిపెట్టును.

మన ప్రేవులయందు నివసించు కొన్ని సూక్ష్మజీవులు మనము తిను ఆహారములో కొంతభాగమును తిని బ్రతుకుచు మనకు ప్రత్యుపకారముగా మన జీర్ణ రసములచే జీర్ణము కాని యాహార పదార్థములను గొన్నిటిని జీర్ణము చేయు శక్తిగలవై యున్నవి.

ఇట్టి విచిత్రమయిన సూక్ష్మజీవులవిషయమై వివరముగ తెలిసికొన గోరువారు వానినిగూర్చి ప్రత్యేకముగ వ్రాయబడిన ప్రౌఢ గ్రంథములను జదువవలయును.