ఈ పుట ఆమోదించబడ్డది
116
హేమలత
జాఢ్యముకుదురునట్లు చేసెదను. అని లోనికరిగి బాలికతో అమ్మా! నీకు మదనసింగు తప్పక భర్త కాగలడు. నీకు శరీరమునగొంచెము రుగ్మత గలదు. నామఠమున నిన్ను రెండుదినములంచుకొని మందిచ్చి పంపెదనురా యని చెప్పి మదనసింగు సమ్మతిమీదనామెను గొనిపోయెను. మదనసింగును జింతాక్రాంతుడై యారాత్రి పండుకొని నిద్రరాక కలవలపడుచుండెను. యోగి మఠమునకు బాలికను గొనిపోయి యామెను నిద్రపుచ్చి తన ప్రియశిష్యుడైన సదాశివుని బిల్చి యాచిన్నదాని విషయమును నాతనితో నేమో చెప్పి యారాత్రి తానును సుఖముగ నిద్రించెను.