పుట:Haindava-Swarajyamu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

193

ద్వితీయ భాగము.


నప్పులు గొని త్రోచుననువులు గొన్ని
చెప్పెద నా మాటఁ జేసెద వేని.....................................610
తనడంబు దప్పక ధనికులయిండ్ల
కనువునఁ జని వారి కనురాగ 'మొదవ
రిత్త మొక్కులు 'మొక్కి ప్రియములు పలికి
నెత్తిఁ జేతులు పెట్టి నిక్కముల్ నొడివి
తెరలఁ దియ్యనిపండ్లతీపులు మరిపి
చరణ సేవలు సేసి చనవులు మెఱసి
యిములఁ దన పేరి నెంతయుఁ జెప్పి
నమ్మికఁ బుట్టించి నయములు సేసి
గడుసరిమనసులు గరఁగించి పుచ్చి
జిడికిరింతలు గట్టి చెవి యాన కున్న...............................620

  • [1](బోలుసొములు లక్కబొదవులు గాజు

.............................................................................................................

క= నామనస్సులోని కొంచలము - తాపమనుట. అప్పులుగొని త్రోచుననువులు= అప్పులు దీసికొని యియ్యక మ్రింగి యుబుసుపుచ్చు నుపాయములు, డంబు= ఆటో పము, రిత్త మొక్కులు=మనః పూర్వకము కాని నమస్కారములు, నెత్తిఁ జేతు బ.... పలికి= నెత్తిమీఁద చేయి పెట్టి తాము చెప్పిన దెల్ల నిజములని శపథములు చే నీ, తెరలఁ దియ్యనిపండ్ల తీపులు మరిపి = చక్కఁగా మాగిన పండ్ల తీపులయందు వా రిని మరిగించి వశము చేసికొని, పేర్మి= పెద్దఱికము, గడుసరిమనసులు=కటువు లై నమనములు, చిడి కిరింతలు= మోసపుమాటలు, చెవియానకున్నన్ = ఇట్లు యుక్తు లుచేసి మోసములుపన్నియు తమమాటలు వారి చెవిలో నెక్కకున్న యెడల నను ట,ఇఁకచేయవలసిన మోసపుఁ గార్యములను జెప్పుచున్నాడు:-లక్క బొదువు ...............................................................................................................

  • ఈకుండలీకరణములోనిది పెక్కు ప్రతులఁ గానరాదు. కనుకఁ బ్రక్షి ప్తము
    గానోపు. ఇది లేక యేయున్నఁ గథాప్రణాళిక మిక్కిలి యొప్పిదముగా నుండును.