పుట:Ecchini-Kumari1919.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణ ము 16

85


ధూర్తు రాలు కాదు. సద్గుణవతి, యోగ్యురాలు, ఆమె తనంతం దా నిల్లు విడుచుట కంగీకరించి యుండదు. శత్రువు లెవ్వరో యామెనుగొనిపోయి యుండవలయును. అభయసింహుఁడును, రూపవతియు, నిచ్ఛినియు శత్రువుల చే వంచింపఁబడియుందురు. దేవాలయమునుండి యీదుర్గమునకు వచ్చులోసల నే యీ ఘోరము జరిగియుండ వలయును. రక్షకభటులు సవారీ మరల నతఃపురమునకు వచ్చినదని చెప్పుచుండుటచే నదియు నసంగ తముగా నే యున్నది. నాకు బ్రాణపదమగు కుమారిజాడ లెవ్వరు తీయుదురో వారికి గొప్ప బహుమాన మిచ్చెదను. పోయి చుట్టుపట్ల దేశములు వెదకి యామె వృత్తాంత మరసి వినిపించి నన్ను బ్రదికింపుఁ ' డని పలికెను . .

పదు నా ఱ వ ప్రకరణ ము

బాట సారులు

సమీపముగా ఆబూపర్వతమునకుఁ బడమటి దెసను నొకదుర్గము కలదు. అదిఘూర్జర రాజ్యములోనిది. ఆసమి పా రణ్యముల నివసించుదొంగలు గ్రామముల పై బడి కొల్లం గొట్టి దేశమునకు మూపదవముఁగల్గించుచుండ దాని నడంపఁ జాలిన సైన్య మాప్రాంతమున నివసించియుండుటకు భీమునిపూర్వు లెవ్వరో యాదుర్గమును గట్టించిరఁట. మన కథాకాలమున నాకోటలో సామాన్యమగు సైన్యము కలదు.