పుట:Ecchini-Kumari1919.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము .6

31



యాసుందరిరూపమును మాటిమాటికిని జూచుచు నిట్టూర్పులు పుచ్చుచుఁ గాలము గడ పుచుండెను. కాని, యతఁ డెంత కాల మటు గడపఁగలడు? ఆసుందరిని వివాహమాడవలెనన్న కోరి - యగ్ని హోత్రతుల్యమై హృదయకుహరమును దహిం చుచుండ నెట్టు లోర్చియుండఁగలఁడు ? కావున, నతఁ డూర కుండక యిచ్ఛినియభిప్రాయ మెట్లున్నదో, యామెజనకుఁ డామె సెన్వరి కీయఁదలంచుచున్నాడో, మొదలగుసమాచార తెలిసికొనవ లెనని యెంచి యిచ్ఛిని యతఃపురమున నర్తించు దాసీజనముతో స్నేహము చేయుచు వారికిఁ దగిన బహుమతు లిచ్చుచు, వారి నొక పరిఁ దనయింటికి రప్పించు కొనుచు, మఱియొక పరి రారాత్రిసమయములందుఁ దానే వారి యిండ్లకుఁ బోవుచు నీవిధమునఁ గాలము గడపుచుండెను.

ఒక నాఁ డభయసింగు నిశాసమయమున నొక యువతి యింటి కరిగెను. ఆమెయు నతని నుచితరీతుల గౌరవించి యాసనమునఁ గూర్చుండఁ జేసి 'అయ్యా ! మీ రెన్నో సారులు నాగృహంబునకు వచ్చినారు. మీవంటివారు మాయింటికి నచ్చుటచే మాయిల్లు 'పవిత్రస్థల మగుచున్నది. మేమును గృతార్థుల మగుచున్నాము. ఇందువలన నాకు మితిమీరిన యానందము గల్గుచున్నది. కాని, మీరిట్లు దయ చేయు చుండుటకుఁ గారణ మరయ నేరక యాకులపడుచున్నాను, మున్ముందుగా . మీ రాయకుల పాటును దొలఁగింపఁగోరు చున్నాను, ' అని పలికెను.