పుట:Ecchini-Kumari1919.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

ఇచ్చి నీ కు మా రి


జా దేశమును బాలించుచుండినట్లు జైనమత గురువులు వ్రాసిన వ్రాఁతలవలనఁ దెలియవచ్చుచున్నది. అతఁడు మహాపరా క్రమవంతుఁడు, యుద్ధములందు మిగుల సమర్థుఁడు. అతడు సూర్యు నారాధించి యతనివలన నొక ఖడ్గమును బడసి చిర కాలమునుండి యా దేశమున నివసించియున్నయాటవికు లను బాజఁదోలి రాజ్యము స్థాపించి పాలింపనారంభించెను. కొన్ని యేండ్లు గడ చెను. ఇట్లుండ మహాధనసంపన్నుఁ డగు 'రంకు' అను వర్తకునితో నమ్మహా రాజునకు విరోధము సంభవించెను. ఆవర్తకుఁడు మిగులఁ బట్టుదల గలవాఁడు. అతఁడు తనపగ దీర్చుకొనుట కై శిలాదిత్యునకుఁ బూర్వ విరోధులగు నాట వికులతో స్నేహము చేసి వారికిఁ గోరినంత ధన మిచ్చి వల్ల భీపురమును ధ్వంసము గావింపఁ బురికొల్పెను. వారును మహానంద మొంది తమ పగను దీర్చుకొనుటకై వల్లభ పురము పై గవిసిరి. శిలాదిత్యుఁ డది విని ధీరుడై తన సైన్య ములను గూచ్చుకొని వారి నెదిరించెను. కాని, దైవము ప్రతి కూలమైనందున నతనికిజయ మబ్బ లేదు. ఆయుద్ధమం దే వీరమరణముఁ జెందెను. అతనికి సంతానము, లేనందున నతనితోఁ దద్వంశ మంతరిం చెను.

అనంతరము రమారమి రెండు శ తాబ్దముల కాలము గుజరాతును బాలించువా రెన్వరో మనము - స్పష్టముగాఁ జెప్పఁజాలము. అందులకుఁ దగిన యాధారములు లేవు. కాని, యేడవ శతాద్ధాంతమునఁ జోరవంశజుడగు జయ శేఖరుఁ