947
గురు శిష్య ప్రశ్నోత్తరములు
(వ్రాత ప్రతినుండి)
గురు : అబ్బాయీ? నిన్ను కొన్ని ప్రశ్నములడుగఁ దలఁచితిని.
శిష్యు : చిత్తం. యెఱిఁగినంతలో ఉత్తరం మనవి చేసుకుంటాను.
గురు : పాలకొల్లుసభలలో నెందేని మా అమ్మాయి కవిత్వము చెప్పునది కాదనియు, తండ్రిగారే చెప్పి యాపెపేరున ప్రకటింతు రనియు నర్ధము ధ్వనించునట్లు పన్యసించియుందువా? లేదా?
శిష్యు : అట్టి యపోహ నా కుంటే గదా? అలాటిధ్వని వచ్చేటందుకు? లేదని గుళ్ళోలింగాన్ని పీఁకమంటే పీఁకుతాను.
గురు : మొల్లను గూర్చి యైన నిట్లు మాటలాడితివా?
శిష్యు : మొల్లకు తండ్రిగాని సోదరులుగాని కవులైనట్లు ప్రతీతి యెక్కడా వున్నట్లే లేదు గదా? యిట్టి యపోహ మేలాగు?
గురు : పోనీ ఆపెజోలి మన కెందుకు? మా అమ్మాయిని గూర్చియే మఱియొకసారి అడుగుచున్నాను.
శిష్యు : మఱియొకసారి కాదు, వేయిసార్లడగండి.“కవులకూఁతుళ్లు కూడా కవిత్వం చెప్పడం కలదు. శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రుల్లుగారి కొమార్త యిందు కుదాహరణం" అని భావ సం|| మార్గశీర్ష బ 2 శనివారంనాటి కృష్ణలో వ్రాశాను కూడాను.
గురు : దాని నటు లుంచుము. నా భారతమును గూర్చి విశేషించి నాఁడు పాలకొల్లులో నీవుపన్యసించలేదేమి.
శిష్యు : ఉపన్యసించాను. ఆ సభలో సభ్యులరంజనకయి యితరమున్నూ మాటలాడాను. పాలకొల్లు వ్యాసంలో యీ యంశం గతార్ధ మవుతుంది మళ్లా యిక్కడ పిష్టపేషణ మెందుకు?