266
కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
1) శ్లో. “మద్గేహే మశకీవ మూషికవధూర్మూషీవ మార్జాలికా,
మార్జాలీవ శునీ శునీవ గృహిణీ వాచ్చాః కిమన్యే జనాః."
2) శ్లో. “క్షుత్తృ డాశాః కుటుంబిన్యో, మయి జీవతి నా౽న్యగాః;
తా సా మంత్యా ప్రియతమా, తస్యాశ్శృంగార చేష్టితమ్”
3) శ్లో. “ఆరనాళగళ దాహశంకయా మన్ముఖాదపగతా సరస్వతీ”
4) క. “శీతల సలిలస్నానము
భూతలమున శయ్యయొంటిపూట మెతుకులు
న్నాతిగల బ్రహ్మచర్యము
నాతరమా? రోజు గడపనారయభూపా!"
5) శా. "వేధన్ దిట్టఁగరాదుగాని భువిలో విద్వాంసులన్ జేయనే
లాధీచాతురిఁ జేసెఁ జేసిన గులా మాపాటుతోఁబోకక్షు
ద్బాధాదుల్ రచియింపనేల? అది కృత్యంబైన మూఢాత్ములన్,
ఛీ! ధాత్రీశులఁ జేయనేమిటికయా! శ్రీకాళహస్తీశ్వరా!"
6) “శా. సంతోషించితిఁ జాలుఁజాలు బహురాజ ద్వారపౌఖ్యములన్
శ్రాంతిన్ జెందితిఁ జాలుఁజాలు రతిరాజ ద్వారపౌఖ్యమ్ములన్
శాంతిన్ జెందెదఁ జూపు బ్రహ్మపదరాజ ద్వారపౌఖ్యంబు ని
శ్చింతస్వాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వరా!"
7) “తిండికైతె పదిమంది వసంతి, తండులాలు గృహమందునసంతి
రండనా కొడుకు లెల్ల హసంతి కొండగోగులు గృహేవిలుఠంతి"
కవులు ఆగర్భశ్రీమంతులుగా వుండే పక్షంలో ఆ యీపూర్వోక్త రీతిని చక్కని కవిత్వం వెలువడ దని ఆలోచించే అనుకుంటాను బ్రహ్మదేవుఁడు కవులను నొకవిధమైన భిక్షాటన తరగతిలో సృజిస్తాఁడు. బ్రహ్మ దేవుఁడు ఆలోచించి, ఆలోచించి కవులనూ, గాయకులనూ పూర్వోక్త విధంగా సృష్టించినా ఆ యీ రెండు తెగలలోనూ కొందఱు తమ స్వాతంత్ర్యాన్ని నిల్పుకుంటూనే జీవయాత్ర సాగించినట్లు కనపడుతుంది-
చ. "నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక దెచ్చి యిచ్చుక
ప్పురవిడె మాత్మకింపయిన భోజనముయ్యెల మంచ మొప్పుఁద
ప్పరయురసజ్ఞు లూహదెలియంగల లేఖకపాఠకోత్తముల్
దొరికినగాక యూరకకృతుల్ రచియింపు మటన్న శక్యమే”