228
కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
అనే దానిలో, “లోచనాభిరామా మరవింద” అజ్భిన్నం పరేణ సంయోజ్యం కల్పితేనో? చెప్పేదేమిటి కవి సంప్రదాయజ్ఞుడు కాడని-
“మీ మొగము చెప్పక చెప్పెడు నద్దిరయ్య"
అవుతుంది. సంస్కృత రచనలో యతి లేకపోలేదుగాని అక్కడికి పదం విరిగిపోవాలి. “కశ్చిత్కాంతా విరహగురుణా” యిందులో కాంతాశబ్దం 'తా'దగ్గర ఆపక, కాం, దగ్గర ఆపితే యతిభంగదోషం పడుతుంది. భర్తృహరి శ్లోకవ్యాఖ్యలో “సికతాసు తైలమసి" అని వుదాహరించాడు, వృత్త రత్నాకరంలో పృధ్వీ వృత్తంలో యిది కూడా అంగీకరించవచ్చు నన్నట్లు కనపడుతుంది. నేను బాల్యాదారభ్యాదీన్ని గూర్చి విచారిస్తూనే వున్నాను. వృత్తరత్నాకరంలో “యతిభంగో యథా” అనడానికిన్నీ దానికి శ్లోకాన్ని వుదాహరించడానికిన్నీ వుపపత్తి గోచరించనేలేదు. పృథ్విలో తప్ప యితర (శార్దూల విక్రీడితాదులలో) శ్లోకాలలో ఆయీ యతిభంగం కావలిస్తే జాతక గ్రంథాలలో తరచు (శనిరాహుభ్యాంతు కృష్ణాంగకః) దొరుకుతవి. ప్రకృతం ద్వితీయచరణాంత్య తృతీయచరణాదులకు సంధి కల్పవచ్చునా అనేది. అవాంతరంగా పదమధ్యేపాదావసానం వచ్చిచేరింది. ఇది సంస్కృత కవిత్వానికయితే చాలా ఆక్షేపణీయమేగాని తెలుక్కి చాలా సుగుణం అనిపించుకుంటుంది. కనకనే కవిబ్రహ్మగారు నీ కవిత్వంలో “మిన్నగా వుండే పద్యాన్ని" చదవవలసిందని యెవరో అడిగేటప్పటికి- -
"సింగమ్మాకటితో గుహాంతరమునంజేట్పాటుమైనుండి మా
తంగ.. నో జంగాంతార.. వచ్చెంగుంతీసుత మధ్యముండు"
అనే పద్యాన్ని చదివినట్లు కవిపరంపర చెప్పుకుంటారు. ఈ పద్యంలో ఆదిచరణంలో సింగం అనేది తప్ప, తక్కినవన్నీ పదమధ్యే పాదావసానంగానే కుదరడం చాలా గౌరవనీయం. ఇట్టి కూర్పు తిక్కన వంటి కవికిగాని కుదరదని ఆంధ్రమహాకవులు యావన్మందీ యేకవాక్యంగా అంగీకరిస్తారు. సంస్కృత రచనలో రెండు మూడు చరణాలకు సంధి కల్పినవి యెక్కడా దొరకవని నా విద్యార్థి దశలో యెవరో నన్ను ఆక్షేపించడంవల్ల తెలుసుకున్నానుగాని, అలాగే కాకపోతే యీ రహస్యం తెలుసుకోకుండానే జీవ సమాప్తి పొందవలసిందే. విజయనగరం మహారాజులుంగారి దర్శనంనాటికే యీ రహస్యం తెలుసుకోవడం జరిగింది. అప్పటి నా వయస్సు 24 సంవత్సరాలు. ఆ మహారాజావారి మీదఁ జెప్పిన పద్యాలలో,