54
బొబ్బిలియుద్ధనాటకము.
రాణి, పురో. భా. - హరీ ! హరీ !
రాణి. - బాలికలారా మీయనురక్తిని మఱవను. [వేంకటలక్ష్మి బాలికలకు పసద నంబిచ్చును.]
వేగు. - రాయనింగారికి జయంకలిగితే మాకేమితక్కువ.
రాణి. - మంచిది పోయిరండి. [వేగుబాలికలు నిష్క్రమింతురు.] కానీ: ఇందులకు బదులు నేను గోపాలస్వామి సన్నిధిలో పలికెద. అవ్వగారూ, ఇక మాకు స్వామియే దిక్కు గోపాలస్వామిని కడసారి సేవించుకొని మేము సిద్ధముగా నుండెదము. వేంకటలక్ష్మీ, మాబాబును, మాకొమార్తను, తెమ్ము. పెండ్లి కొమార్తలను, దాసీజన సమేతముగా తోడ్కొని వచ్చి, గోపాలస్వామికి పూజచేయించి, మాకు దర్శనమునకు సిద్ధము చేయింపుము.
వేంక. - దేవిగారియాజ్ఞ.
[అని నిష్క్రమించును.
రాణి. - [ఒకదాసిని ఉద్దేశించి] ఓసీ ! కామాక్షీ ! నీవు బ్రాహ్మణవీథి కేగి పేరంటాండ్రను గుడికి తోడ్కొనిరా.
కామాక్షి. - దేవిగారియాజ్ఞ.
[అని నిష్క్రమించును.
[అంతట సుందరమ్మ, చిన వేంకట రాయఁడు
పెండ్లి కొమారితలు, దాసీజనమును ప్రవేశింతురు.]
వేంక. - [వచ్చి] దేవిగారు ఆజ్ఞాపించినట్లు స్వామికి ఆచార్యులచే పూజచేయించితిని. మఱి తమ రందఱు దర్శనము చేయవచ్చును.
రాణి. - రండి, నాబంగారు కొండలారా ; మావంశాంకురము లారా, రండి; [అని కొమారితను కుమారునిం జేర దివిచి.] రండి నన్నుఁగన్న తల్లులారా ! రా రండి గోపాలస్వామికి కడసారి సేవచేసి కొందము.
[అందఱు మల్లమ్మదేవివెంట దేవళములోనికి ప్రవేశ మభినయింతురు.
రాణి. - ఆహా !
తే. పరమపురుషునింటి పట్టుసొచ్చిన మాత్ర
నాత్మ యెంత శాంత మయ్యె నహహ !
జాగిలంబులట్లు చాఁజీల్చితిను వగల్
కలయుఁబోలె విరిసి తొలగి పోయె. ౫౮
[ఆత్మగతము] అయినను మరల దిగులు మిగులుచున్నది.