ప్రజలను నడిపించే నాయకుడు క్రీస్తు. యావే ప్రభువు ఫరోకు డబ్బుచెల్లించిగాదు, అతన్ని అణగ్రద్రోక్కి యూదులకు విముక్తి కలిగించాడు అన్నాం. అలాగే క్రీస్తుకూడ పిశాచాన్ని ఓడించి మనకు పాపవిముక్తి కలిగించాడు.
4. విమోచనం దేవినుండి?
క్రీస్తు మనలను స్వతంత్రులనుగా జేసాడు అన్నాడు పౌలు - గల 5,1.ఈ స్వాతంత్ర్యమే విమోచనం. అనగా ప్రభువు మనకు పాపదాస్యాన్నుండి విమోచనం ప్రసాదించాడని భావం. పౌలు దృష్టిలో క్రీస్తు మూడు బాధలనుండి మనకు విమోచనం ప్రసాదిస్తాడు.
1. పాపం నుండి : మనం పుట్టుకతోనే పిశాచానికీ పాపానికీ దాసులంగా పుడతాం. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందడం ద్వారా ఈ దాస్యాన్నుండి విముక్తి చెందుతాం - రోమా 6,6, కొలో 1,13-14.
2. మరణం నుండి : ఆదాము పాపం ద్వారా నరులందరికీ మరణశిక్ష ప్రాప్తించింది. చావు మనలను బాధించే ముల్లు.కాని క్రీస్తు మరణోత్దానాలద్వారా ఈ ముల్ల తొలగిపోయింది - 1 కొ 15,56. నేడుకూడ మనకు చావు తప్పదు. కాని దాని విషపరిణామం మాత్రం తప్పించుకొంటాం.
3. ధర్మశాస్త్రం నుండి : పూర్వవేద ప్రజలు ధర్మశాస్రానికి దాసుల.దాని నియమాలను పాటించలేక వాళ్లు నానా యాతనలూ అనుభవించారు. నూత్నవేదంలో ఈ ధర్మశాస్త్రం నుండికూడ క్రీస్తు మనకు విముక్తి ప్రసాదించాడు - రోమా 7,6. నేడు మనలను నడిపించేది క్రీస్తు ఆత్మేగాని ధర్మశాస్త్రంగాదు - 8,2.
ఈలా క్రీస్తుద్వారా స్వాతంత్ర్యమూ విమోచనమూ పొందిన క్రైస్తవుడు దేవునిపట్ల చనువుతో మెలుగుతాడు. ఇంటిలోని పిల్లలు తండ్రిని జూచి భయపడరు. చొరవతో అతని వద్దకు వెళ్లారు. ఆలాగే క్రైస్తవుడుకూడ తన్ను విమోచించిన క్రీస్తుద్వారా చనువుతో తండ్రివద్దకు వెళాడు - ఎఫే 3,12. హెబ్రే 4,16. ఈ చనువు భయానికి వ్యతిరేకమైనది. పూర్వవేద యూదులు యావే ప్రభువుకి భయపడేవాళ్లు, నూత్నవేద ప్రజలమైన మనం దేవునికి భయపడం. ప్రేమతో, ధైర్యంతో, చనువుతో అతని వద్దకు వెత్తాం. ఈ చొరవను మనకు ప్రసాదించేది క్రీస్తే.