పుట:Bhoojaraajiiyamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పావకలోముని కథ

121


నున్నాఁడు నిదుర వోవుచుఁ
గన్ను దెఱవఁ డాఱునెలలు గడచన కున్నన్.

75


తే.

కలదు వీనికి నొక చమత్కార మనఘ!
యితర పురుషుఁ డిచ్చోటికి నేఁగుదెంచె
నేని యొక జాములోనన మాను నిదుర
వాఁడు వధియించు నెంతటివాని నైన.

76


క.

కావునఁ బదివే లైనను
నీ వీ యెడఁ దడవుగాఁగ నిలువవలదు పొ
మ్మా' వెస ననవుడు ని ట్లనుఁ
బావకలోముండు కార్యబంధురుఁ డగుచున్.

77


ఉ.

'చెచ్చెర నాకు నీ వెఱపు చెప్పకుఁ డేను స్వయంవరంబునం
దెచ్చిన కన్య నీ యసుర దెచ్చె వెస న్ననుఁ గానకుండ! నే
వచ్చితిఁ దన్నిమిత్తమయి, వాని వధింపక రిత్త వోవ; మీ
రిచ్చట నిట్టు లుండఁ గత మెయ్యది చెప్పుఁడ నాకు' నావుడున్.

78


ఉ.

ఖేచరుఁడై నిశాచరుఁడు కేవలసాహసుఁ డొంటి వచ్చి మా
యాచణభావ మేర్పడఁ ద్రియామల నిద్రిత లైన రాజక
న్యాచయముం గ్రమక్రమమునం గొనివచ్చి దురాత్ముఁ డిందులో
వైచిన వాఁడు తా నటె వివాహము గాఁగలఁడట్టె మీఁదటన్.'

79


క.

అని తమ తెఱఁగంతయుఁ జె
ప్పి 'నరోత్తమ! యిందు వచ్చి పెక్కండ్రు నృపుల్
సని రిట మున్న యమాలయ
మున కి ద్దానవునిచేత బుద్ధిరహితులై.

80


వ.

కావున నీ యసురాధముండు లేవకమున్న నీ వెందేని యరిగి ప్రాణంబులు
రక్షించుకొనుట ల గ్గట్లు కొక యోపుదేని వీని వధించి నిన్నును మమ్మును
రక్కసుబారిఁ బడకుండఁ గాపాడునది' యనిన న ప్పావకలోముండు తీవ్ర
ధాముండునుంబోలెఁ బ్రతాపదీప్తుం డగుచు నచ్చోటు వాసి వచ్చి కుంభకర్ణుండు
వోలే నిద్రించియున్న యసురకు దీర్ఘనిద్ర గావింపం బూని కదిసి యి ట్లున్న
యునికిన వధియించుట పౌరుషంబు గాదని యమదండంబువోని యంఘ్రిదం