పుట:Bharatiyanagarik018597mbp.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాంబనస్-ఆలయము

ఈ యాలయముగూడ జావాద్వీప 'శిల్పుల కళానైపుణ్యమును జాటుచున్నది. భారతదేశముననేగాక, భారతీయ నాగరికత విస్తరించిన దేశములన్నిటియందునుగూడ వాల్మీకి రచించిన రామాయణము విశేషముగ బ్రేమింపబడి గౌరవింపబడినది. నయాంభాషలో 'రామకియన్, అనియు, మలేభాషలో హికాయత్ సెరిరామ, యనియు నీ గ్రంథము గాంచనగుచున్నది. యవద్వీపమునం దియ్యది విశేష వ్యాప్తి నందెను. దీనికి 1200 భాషాంతరీకరణములు ప్రాచీన జావాభాషలో గలవు. అంతియగాక వనటరన్, ప్రాంబనన్ దేవాలయములలో నీ-కథయంతయు శిల్పమున జిత్రింపబడినది. వనటరన్ శిల్పములలో నీ చరిత్రము శ్రీరామచంద్రుడు లంకాద్వీపమున కేగునప్పటినుండి ప్రారంభమగు చున్నది.

నుకు దేవాలయములు

యవద్వీపములో మధ్యభాగమున లోవిస్ (Lowes) పర్వతములకు సమీపమున నీ దేవాలయము గలదు. యవద్వీపకళా చరిత్రమున కియ్యది మిగుల ముఖ్యమైనది. ఇందలిభాగములు క్రీ. శ. 1435-1440 ల నడుమ అనగా బిల్వతిక్తపుర సామ్రాజ్యమును, హిందూమతమును గూడ నీ ద్వీపమునం దంతరించుటకు గొంచెము ముందుగా నిర్మింపబడినవి. ఇందలికళ క్షీణావస్థను సూచించుచున్నది. ఇయ్యది వైష్ణవాలయము. ఇందు మూడంతరువులును, వానిపై నొక గోపురమును గలవు. ఈ కట్టడము మధ్య అమెరికాలోని యుకటస్, మెక్సికో అను స్థలముల నున్న కట్టడములను బోలియున్నది. ఇందుమూలమున యవద్వీపవాసు లమెరికాకేగిరా? లేక నమెరికనులే యీ ద్వీపమున కేతెంచిరా? యను సమస్యలు బయల్వెడలు చున్నవి. బహుశ: యీ రెండు స్థలములందును గూడ నొకేజాతివారలు నివసించి యొకేజాతి కట్టడములను నిర్మించి యుందురు. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయము.