57
భారత రమణి
కేదా--అంతయు ఆఖరున చెప్పెదను. ముందుగా యీ మహాత్ముని (అజ్నేశ్వరునితో) పెండ్లి కొడుకా, పొమ్మిటనుండి.
యజ్నే--ఏమి యీ దురంతము! దేవేంద్రా?
కేదా--నేను పొమ్మన్న మూర్ఖా పోవేమి?
దేవే--కేదారా, ఏమిది?
కేదా--నీ వూరకుండుము, లేకున్న కలహముతప్పదు. లేవవేమిరా! కుక్కా! పందిలాగ బలిసి నావు. పద యయటికి, లేకున్న కిరీటపూజ తప్పదు. ఒక కాలు కాటికి ఇంకొకటి నరకమునకును దాచుకొన్న నీకు పెళ్లి కావలెనా? పెద్దమ్మా- పద- బాలికా! నిర్భాగ్య దామోదరా!
యజ్నే--నన్నెందుకు తిట్టెదవు?
ఉపే--పెద్దమ్నుష్యులయెడ నీవిట్లు వర్రింప జెల్లునా? కేదారా!
కేదా--ఓహో ! మహర్షిగారా ! మిమ్ము చూడనే లేదు. ఏమిరా! లేచెదవా ? చెప్పుదెబ్బలు కావలెనా? ఊ లేవవేమి?
సదా-- కెదారా!
కేదా-- మాటాడ వలదని చెప్పితినె సదానందా! నాకు రెయిలువేళ మించుచున్నది.ఈ కాకీమూక నిక్కడ నుండి వెడలవడసిన గాని నేను వెళ్లను. మంచిమటలతో వీరు వెళ్లినచో చెప్పులు పడవు,లేకున్న కర్రలకు పని కల్పిం