160
భారత రమణి
[అం 5
పూతారిత్రా - గౌరవపాత్రా
సంవృతి శోకలతాలవిత్రా ॥చి॥
-----
అందరు-- జే బారతరమణికి జే! భారతమాతకు జే! భారతభాగ్యవిధాతకు జే!
--: మూడవ రంగము :--
(చెరసాలలో ఉపేంద్రుడు)
ఉపే-- నేను సర్వమును వీడి వచ్చితిని గాని దు:ఖము నన్ను వీడుటలేదు. చెఱసాలకు నేను వచ్చినను ఇది చేయి వీడకున్నది... అయ్యే ! నేను గానుగయెద్దువలె నాపాపానరణమున క్రుమ్మరు చున్నాను. అబ్బా ! ఇది నన్ను కొరడాతో చావమోదుచు ముల్లుకఱ్ఱతో ముట్టిపై పొడుచుచున్నది. నాహృదయసాగరమున తుపాను పుట్టినప్పుడెల్ల దాని ప్రబలోచ్ఛ్వాసము పొంగి పొర్లుచున్నది. ఇప్పు డెవరినైన గాఢముగా కౌగిలింపవలెనని యున్నది. నా అంతరంగము పరిక్షుభిత మగుచున్నది. మనోవ్యాధి జనించిలోలోన బాధ కెరలు చున్నది. ప్రాయశ్చిత్త మేనాటికి పరిశేషించునో యోచింప జాలను. హా! దైవమా! ఎన్నాళ్లకు దరిజేర్చెదవు?
(చెఱకాపరి వచ్చును)
చెఱ-- రెండేళ్ళకు--