[అం 4
భారత రమణి
అను నేను సాటిసేయను.
వినో--పాటించినను, పాటింప కున్నను, పెండ్లియాడి నను, ఆడకున్నను.... ఇంటికి నడువుము.
సుశీ--నేను రాను. అక్కా! నా స్వభావము నీకు చక్కగా తెలియును. ప్రతికర్యమును, నాకు నచ్చినట్లు నాబుద్దికి దోచినట్లు, నాప్రవృత్యనుసారము చేయుచుందును, కాని ఒకరి మాట వినను, నామేలు నే నెరుగుదు.
వినో--ఇంటికి రావా?
సుశీ--ఎన్నిసారులు చెప్పుచుందువు! నేను రాను. నాతల్లి కట చోట లేకుండిన నాకు మాత్ర ముండునా? నీవు పోయి హయిగా కడుపునిండ తినుచు కంటినిండ నిద్రించుచు జీనములను భరించి యుండుము. అది నా చేత కాదు. అట్టి బ్రదుకు నాకేహ్యము.
వినో-- ఇంతకన్న నెక్కువ నేనేమి చెప్పగలను?... ఒకవేళ వినయుడు బోధించిన విందువేమో?(వెడ వెడ నవ్వును) కాని అతడు నీయెదుట పడుటకు కూడ సమ్మతింపకనన్నిట విడిచి నదీకూలమునకు నడిచెను. నీ నోటివడిచేతనే అతని మనసు నొవ్వజెసితివి.
సుశీ-- ఔ నక్కా, తప్పంతయు నాదే, అట్లే చాటుచుండుము. వినో-- అయితే ఇంటికి రావా?
సుశీ--రాను.