పుట:Bhaarata arthashaastramu (1958).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వస్తువులగొని వినియోగించుటకేగదా! ఆ వినియోగమే ప్రాపించిన దానినేల ఆదాయమనగూడదు?

కావున మూలధనంబు మూడుమూర్తుల వెలయునని ఎఱుగునది. వీనిని ఉత్పత్తి స్థితి లయ స్వరూపములనియు జెప్పవచ్చును. ఎట్లన, 1. ఉత్పత్యాధారము. 2. ఆదాయసంధాయకము. 3. వినియోగానుకూలము ఇమ్మూటి సామాన్యలక్షణము లేవియన:-

1. మూలధనము ధ్రువంబు. ఆదాయ మప్పుడప్పుడు వెచ్చించుటకై యుంచబడినది. దృఢంబయ్యును శాశ్వతంబుగాదు. ఎట్టి యంత్రమును నేడుగాకున్న నిక నూఱేడులకైన శిథిలమగును. భర్మహర్మ్యములును ప్రళయకాలపర్యంత ముండబోవు. అయిననాదాయమునకన్న నెక్కువకాలమువచ్చును. ఇది సంభావనీయాంశము.

2. మూలధనము పుంజి. అనగా నిజమైన మొత్తముగా జూడబడునది. గృహములు బండ్లు ఇవి నానాటికి క్షీణించును. కాన తొలుతనుండి యీ నష్టమునకుగాను వచ్చుబడిలో గొంచెమెత్తి వేరుగబెట్టుట వ్యాపారులకాచారము. ప్రతికంపెనీవారును పరిహీణతాపూర్తికై లాభములో నొకపాలు వినియోగింపకయుంతురు. కావున నియతి తగ్గదు.

3. ఆదాయనిర్వచనమున సద్య: ఫలప్రదాయకత్వము ముఖ్యం. మూలధన విచారణములో నుత్తర ఫలప్రాప్తి ముఖ్యము. ఒకతూరి వాడినంతనే లయించువస్తువులు ఉత్పత్త్యర్థమై వాడబడినవికానిచో