పుట:Andhrula Charitramu Part 2.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదకీయభూమిక


ఇది యాంధ్రులచరిత్రయందు ద్వితీయభాగము. గ్రంథకర్తగారు మా చదువరులకు చిరపరిచితులు గావున వారిని గురించి మేమేమియు విశేషించి వ్రాయబనిలేదు.

చరిత్రలు వ్రాయుట సులభసాధ్యముగాదు. అందును నిదివరకు మార్గమేర్పడని పట్టులను సాధించుట కష్టతరము. ఆంధ్రజాతి చరిత్రమునకు రాచబాటవైన మొదట పూనినవారు గ్రంథకర్తలగు శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు అని నుడువుటలో సాహసంబేమియును లేదు. దుర్గమప్రదేశములకు మార్గమేర్పరుప బూనువారు అనేక తరులతాదుల భేదింపవలసియుండును. అందొకకొన్ని నైజముగ మిక్కిలియుపయోగకారులయి యుండవచ్చును. అట్టివానిని మహత్తరోపయోగకారమునకయి త్యజింపవలసియుండును. మార్గనిర్మాత ప్రమాదవశంబుననొక్కొక్కెడ నుపయోగపరిమితి నిర్ణయించుకొనలేకపోవచ్చును. పరిస్థితి వైపరీత్యంబువలన నుపయుక్తంబగు పదార్థంబు విషమంబుగ గాన్పించుటగూడ గలదు.

బొసగు లోపములన్నింటికి ప్రథమమార్గనిర్మాత