పుట:Andhrula Charitramu Part-1.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 
వాగ్దేనీస్తనహారనిర్మలయశోవాల్లభ్యసంసిద్ధితో
దిగ్దంతిశ్రవణానిలోజ్జ్వలరట త్తీవ్రప్రతాపాఢ్యుఁడై"

ఈ వెలనాటి గొంకరాజునకు కౌశికగోత్రుండగు నండూరిగోవిందామాత్యుడను నియోగి మంత్రిగనుండి ప్రసిద్ధిగాంచినవాడు. ఈ గోవిందామాత్యుడుగూడ కేయూరబాహ చరిత్రమునందె యిట్లువర్ణింపబడియున్నాడు.

" మ. విహితాస్థానమునందు జూపుఁదగ గోవిందాభి ధాన ప్రభుం
డహితోర్విధర వజ్రగొంకవిభు రాజ్యాధిష్ఠుడై సంధివి
గ్రహముఖ్యోచిత కార్యసంఘటనతం త్రప్రౌఢియున్ బాఢన
న్నహనోదగ్రరిపుక్షితీశబహు సైన్యధ్వంసనాటోపమున్."

రెండవవిదురరాజు.

ఈ మెదటి గొంకరాజున కన్నకొడుకగు రెండవవిదురవర్మ వేగీరాజప్రతినిధియగు వీరచోడ భూపాలునకు మంత్రియ సేనాధిపతియునై యాతని యాజ్ఞానుసారముగ పాండ్యభూమిపతిని యుద్ధములోనోడించి విజయముగాంచి తనప్రభువుచే సింధుయుగమంతర దేశపాలకత్వమునువహించి పరిపాలనము చేసి ఖ్యాతి గాంచెను.

కులోత్తుంగరాజేంద్రచోడుడు.

వెలనాటి గొంకరాజు పుత్రుడయిన యీ చోడుని చాళుక్యచోడుడు పెంచుకొని పదునాఱువేల గ్రామములుగలిగి యుండిన వేగిదేశమునకు రాజప్రతినిధిగ నియమంచియండును. ఈ వెలనాటి కులోత్తుంగ రాజేంద్రచోడునకు గొంకరాజు మంత్రియైన నండూరి గోవిందన్న కుమారుడు కొమ్మనమంత్రిగనుండెను. వీరిరువురును గూడ కేయారబాహచరిత్రమునం దిట్లు వర్ణింపబడియున్నారు.