పుట:Andhrula Charitramu Part-1.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యావశ్యకముగాకపోదు. జైనమత స్థాపకుడయిన మహావీరుడు గౌతమబుద్ధునకు సమకాలీనుడనియును బంధువుడనియును జెప్పెదరు. ఇతడు మగధదేశములోని పాటలీపుత్రనగరమునకు నిరువదియేడు మైళ్లదూరముననున్న వైశాలియను పట్టణమున జనించెను. అప్పుడు రాజ్యముచేయువాడు రాజుగాక క్షత్రియకుటుంబములోని నాయకులనేకులు గలిసి రాజ్యపరిపాలనము సేయుచుండిరి. నాయకసత్తాకరాజ్యము (Oligarchical Republic) అని పిలిచెదరు. ఈ మహావీరుడట్టిక్షత్రియనాయకులలో "నతివంశ"జుడగు నొకనాయకునియొక్క కనిష్ఠపుత్రుడుగానుండెను. ఇతడు ముప్పదేండ్లప్రాయముననే పారసనాథులను సన్న్యాసులలో గలిసి రెండు సంవత్సరములు సంచారము జేసిన తరువాత స్వతంత్రమతమును స్థాపించి నలువదేండ్లవఱకు ధర్మబోధన సేయుచు నుత్తరదక్షిణమాగధములయందు మఠములగొన్నిటి నేర్పాటు చేసి క్రీస్తువునకు బూర్వము 490 దవ సంవత్సరములో బరమపదము గాంచెను. ఈ మతావలంబకులను మొదట నిర్గ్రంధులని పేర్కొనిరి. అనగా వీర లేగ్రంథముల నీశ్వరదత్తములని విశ్వసించువారుకారని యర్థము. ఈ మతము వారు తమమతస్థాపకులను మహావీరులనిగూడ"జిను" లని చెప్పినందున నీ మతమున ఇటీవల జైనమతమని పేరువచ్చినది. కొంతకాలము గడచిన తరువాత దిగంబరులనియు శ్వేతాంబరులనియు వీరలు రెండుతెగలుగ నేర్పడిరి. ఈ మతము క్రమక్రమముగా దక్షిణమునకు వ్యాపించెను. అకలంకుడను జైనాచార్యుడొకడు కాంచీపురములో బౌద్ధులనోడించి వెడలగొట్టెనట. జైనులు ద్రావిడకర్ణాటభాషలలో చక్కని యుద్గ్రంథములను వ్రాసిరి. ప్రస్తుతము హిందూదేశమున 15 లక్షల జైనులు మాత్రమున్నారు.

జైనమత సిద్ధాంతములు.

1 వేదములు పౌరుషేయములు; 2 అరూగముడను సర్వేశ్వరుడొకడు మాత్రము గలడుగాని సర్వశక్తిమంతుడయ్యును తటస్థునివలె మారకుండును. 3 మనసదాచరణ దురాచరణలే మనలరక్షించుటకు శిక్షించుటకుగారణములుగాని యీశ్వరుడు మనలనిష్టమువచ్చినట్లు రక్షించుటకు శిక్షించుటకు గార