పుట:Andhra bhasha charitramu part 1.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2.సవపాసండ వసేయు సవే హి తే సయమం భావసుధిం చా
  (సర్వేపాషండా వసేయు: సర్వే హి తే సంయమం భావశుద్ధిం చ.)

3. ఇఛంతి జనేచు ఉచావుచఛందే ఉచావుచలాగే తే సవం ఏకదేశం పి
   (ఇచ్చంలి జన: తు ఉచ్చావచచ్చంద: ఉచ్చావచరాగ:తే సర్వం ఏక దేశమపి.)

4. కఛంతి విపులె పి చు దానే అస వధి సయమే భావసుధి కిటనాతా
   (కరిష్యంతి విపులమపి తు దానం యస్య నాస్తి సంయమో భావ శుద్ధి: కృతజ్ఞాతా.)

5. దిడభతితా చా నిచే బాధం
   (దృడ భక్తితా చ నీచా బాడం.)

________

తెనుగు.

దేవానాంప్రియుడు ప్రియదర్శిరాజు సమస్తజనులను తమ యిచ్చవచ్చినచోట వసింపవచ్చునని కోరుచున్నాడు. వీరందఱును సంయమమును భావశుద్ధిని, కోరుదురుగదా. కాని జనులు వేర్వేరు కోరికలను, వేర్వేరు రాగములను కలిగిఉందురు. వారు తమధర్మములలో అన్నిటినిగాని, కొన్నిటిని మాత్రముగాని నిర్వర్తింతురు. విపులమైన దానమును, సంయమమును, మనశ్శుద్ధియు, కృతజ్ఞతయు, దృడభక్తియు లేనివారు తప్పక నీచులగుదురు.

11 - వ శిలాశాసనము.

1. దేవానంపియే హేవం ఆహా నధి ఏదిసే దానె అదిసే ధయదానే ధంమసంధవే
  (దేవానాంప్రియ: ఏవం ఆహ నాస్తి ఈదృశం దానం యాదృశం ధర్మదానం ధర్మసంస్తవ:)

2. ధంమస విభాగే ధంమసంబంధే తత ఏస దాసభటికసి.
   (ధర్మసంవిభాగ: ధర్మసంబంధ: తత: ఏషా దాసభృతకే.)
   సంమ్యాపటిపతి మాతాపితు సుసుస.
   (సమ్యక్ర్పతిపత్తి: మాతాపితృ శుశ్రూషా.)