పుట:Ananthuni-chandamu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్తకోకిల, తరళ, తురగము మొదలయినవృత్తములు; వృషభగమన, హరిణగతిరగడలు (గురుజాడ అప్పారావు గారి ముత్యాలసరములు మొదలయిన పద్యము లీగతిని నడుచును).

9. త్రిపుటతాళమునకు (చతురస్రగతి తిశ్రజాతి త్రిపుట 4(3+2+4)=28) ఉత్పలమాల, చంపకమాల నడుచును.

10. ఆదితాళమునకు (చతురస్రగతి చతురస్రజాతి త్రిపుట) కందము, సరసిజము, క్రౌంచపదము మొదలయినవి.

ఈలాగున ఇంకా విమర్శించి చెప్పవచ్చును.

పాదమందుండే అక్షరముల సంఖ్యబట్టి ఛందము లేర్చరిచి ఆఛందములలో ఒకొక్కటి ప్రస్తరించి వృత్తములు కల్పించడమువల్ల ప్రయోజనము విశేషముగా కనబడలేదు. అంతకంటె శ్రుతి కింపుకొలిపే నడకకు ఆధారమైన లక్షణముబట్టి తిశ్రగతిచ్ఛందము, చతురస్రగతిచ్ఛందము మొదలయిన ఛందము లేర్పరిచి పద్యములు చెప్పుటవల్లను ప్రయోజనము విశేషముగా ఉండుననిన్ని అట్లు ఏర్పడిన పద్యములు తెలుగుభాషకు అమరి ఉండుననిన్ని నాయభిప్రాయము. వృత్తములలో ప్రతిపాదములోను గణములు ఒక్కలాగుననే ఉండవలెనన్న నిర్బంధ మున్నది. దానివల్ల ప్రయోజనమేమో!

అయితే లయకు సులువుగా విరిగేటట్లున్న పద్యములకంటె లయ ఉండిన్నీ కనబడకుండా ఉండేపద్యములు అప్రతిహత