పుట:Aliya Rama Rayalu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         నాహవోగ్రబరీదసప్తాంగహరణు
         డతడువిలసిల్లుశ్రీవేంకటాద్రివిభుడు."
                        (న. భూ.)

ఇచట బరీదును బట్టుకొనుటయెగాదు, అసాదుఖాను చెఱగొన్నరాజకుటుంబములనుగూడ జెఱనుండివిడిపించుకొనియె ననిభట్టుమూర్తి తనవసుచరిత్రములో వేంకటాద్రిని నభివర్ణించుచు జెప్పినయీక్రిందిసీసపద్యములో సూచించి యున్నాడు.

     "సీ. నిరతంబు దుర్మార్గనిరతులౌ తురకల
                 నతులసన్మార్గసంగతుల జేసె
         ననియత మోహాంధులౌ పారసీకుల
                 న్వస్త్రీసుఖైకనిశ్చలుల జేసె
         నతినిర్ద యాత్ములౌ యవనుల భూత
                 సంతానతృప్తిప్రదాత్మకుల జేసె
         ద్విజపక్షపాతంబుదెగడుపాశ్చాత్యుల
                 ద్విజపక్షపాతభావితుల జేసె

      గీ. ననుచు గడుమెచ్చి జయలక్ష్మి యాజిరంగ
         కాతరబరీదకేతనఘటితభద్రకలశ
         మెదురుగ బూని యేఘనుని జెందె
         నతడుసామాన్యుడే వేంకటాద్రివిభుడు."
                            (వ. చ.)