బోవు ప్రకరణమున నాబ్రహాము లింక నింకొక విషయమున జదువరుల మనంబుల కాహ్లాద మొస గెడనుగాత.
- _______
రెండవ ప్రకరణము
బాల్యము.
ఆబ్రహాము తల్లిదండ్రులు నివసించుచుండిన దేశస్థితిని గుఱించి యిదివఱకేవ్రాసియుంటిమి. అప్పుడు దేశమునకు దగిన విద్యాశాలలును, విద్యాశాలలకు దగిన యుపాధ్యాయులును అరుదు. మనదేశమునగూడ గ్రామము లనేకములయందు బళ్లు లేకుండుటయును, ఉన్నచో నైన తగుపంతులవా రుండకపోవుట దటస్తించుటయు సర్వసాధారణము. పూర్వ నాగిరకు లగుప్రజలును నవనాగరికాగ్రగణ్యు లగు ప్రభువులును గల హిందూదేశమే యిరువదియవశతాబ్దంబున నిట్టి దుర్దశయం దుండ నిప్పటి కొక శతాబ్దమునకు ము న్నప్పుడప్పుడ గన్నులు దెఱచుచుండిన యా కెంటకీ సీమయందు విద్యాసాధనము లతి యరు దనిన నేమివింత. అందున లక్ష్మీప్రసాదములేని యదృష్ట హీనులకు సరస్వితి చెలిమి కష్టసాధ్యము. థామసు లింకను రొట్టెముక్కకంటె నెక్కు డాశించినవాం డయ్యును దనబిడ్డల జదివించ బ్రయాసపడు చుండును. మొట్టమొదట