ఈ పుట ఆమోదించబడ్డది
vi
షారుఖ్సుల్తాను, అబ్దుర్రజాక్ను రాయబారిగా పంపియుండెను.
ఈ మువ్వురి చరిత్రలను వ్రాసి, చదువరి కర్పించుట నాముఖ్యోద్దేశము,దేశచరిత్రపఠనమందు అభిరుచి గలిగించుట కన్న మరియొకటికగాదు. ఈ మూడు వృత్తాంతములలో, మొదటిదియు గడపటిదియు, నీవఱకు, శారదా, భారతీ పత్రికయందు వెలువడి యున్నవి.వాటినించుక మార్పులతో నట్లె ముద్రించితిని.రెండవది, మార్కొపోలో, యిటీవల వ్రాసినది.చరిత్ర విషయమున, సంశయాస్పదములును,చర్చనీయాంసములును పెక్కింటిని నావ్యాఖ్యానములందు జొప్పించియునాడను. వాటిని గూర్చిన నాయభిప్రాయములు మార్చు కొనవలసి వచ్చిన మార్చుకొనుటకు సంసిద్ధుడను.
భావరాజు వేంకటకృష్ణరావు