దా స భా ర తి
నారాయణదాస గ్రంధావళి
------
హ రి క ధ లు
1.అంబరీష చరిత్రము : 1834 లో చత్రపురములో నొక పెండ్లి పెద్దతో పంతము వచ్చి రాత్రికి రాత్రి రచించిదారణ చేసి మరునాడుదయమే పెండ్లి పందిట్లో దాసుగారు గానము చేసిన కధ.
2. గజేంద్రమోక్షణము: దాసుగరు 1894 లో మైసూరు మహారజావారి సమక్షమున తతన్తముగా పాలగ్లాసువాదముగా చెప్పి రాజసన్మానము నందిరి. ర్చ్న-1886/
3.గోవర్దనోద్దారము; ఒకపరి చేబ్రోలులో దాసుగారు రుక్మినీకల్యాణము చెప్పుట్కు సిద్ధముగా నుండగా సభలో కొంటెగా "హరికధ కాదు గిరికధ చెప్పు" డనగా అప్పటికప్పుడు డాశుగ ప్రయోగమును మించిన ఆసుకవితా పాటవముతో గద్య పద్య గేయము లల్లి ఆలవోకగా చెప్పిన కధ. ఇది నేడుపలబ్దముకాదుగని అంబరీష చరిత్రమున ఒక అవాంతర్ కధగా నిది ప్రగ్ఫక్తమైనది.
4. గౌరప్ప పెండ్లి ; అచ్చ తెలుగుపై దాసుగారి కమిత్ మమకారము. ఫలితముగానిది యవతరించినది. 19031-1940 లో శిష్యుడు పుచ్చల బదరదాసు దీని నచ్చొత్తించెను. ఆ గురువుగారును, ఆయన శిష్యుడు శ్రీ కందిమళ్ళ రంగయ్యదాసు మాత్రమే కొలది పర్యాయము లేతత్కధాగానము చేసిరి. అచ్చతెనుగు పూర్వులు చూపని క్రొత్త మెలకువలు కొన్ని చూపినారు దాసుగారు.
5.జానకీశపధము: నవర్ధదీర్ఘ సంకలితముగ గూడ సార్దమమైన రచన. ఇందు మేళకర్త రాగముల మేలిమి పరిమళించుచున్నది. ఒకరిద్దరు శిష్యలేపాటి యో చెప్పగలిగినను సిద్ధపురుషుడు దాసుగారికి మాత్రమే ఆనాయాన సాధ్యమైనది.
6. ధ్రువచరిత్ర : హరికధ ప్రపంచమున ద్రువతారడైన వీరి హరికధా వాజ్మయచరిత్రము 'ధ్రువచరిత్ర ' రచన తో ప్రారంభమై యుండుట విశేషము.