స్థలం నాలుగు] కుంభరాణా 161
అగ్బ : ఏమీ ?
మురళి : రాణిగోరి వల్లనే యీపట్నం యాత్రాస్తళమైంది. ఆ తల్లికి పిచ్చిపట్టి అంతప్పురములోనే చెరపెట్టినప్పటినుంచి యాత్రికులందరు మెల్లింగా సళ్ళుకొంటున్నారు. మాకొక్క దమ్మిడీ యిచ్చేవాళ్లు కూడా కనబడరు.
తాన్ : ఈ పిచ్చికథను సామాన్య జనులందరు నమ్ముచున్నట్లే యున్నది - ఈయూరిలో విశేషము లేవియైనఁ గలవా?
ముర : రాణిగోరికి పిచ్చిపట్టిందొక పెద్ద విసేసం. ఆలుబిడ్డల్ని పెట్టుకొని గుట్టుగా కాపరంచేస్తుండే సంసార్లకు మతాలు వైరాగ్యాలు నేర్పించి కుటుంబాల్లో కలహాలుపెట్టే గురువుల్ని సన్నాసుల్ని రాజ్యంలోనుండి యెళ్ళగొడ్తారని మొన్నదొరగారు పట్నమంతా తుడుమెయ్యించారు. ఈది బళ్ళల్లో యేమితెలియని పిల్లకాయలికి యేలాంటి మతాలు మాయమాటలు చెప్పకూడదనీ యిందుకు తప్పినట్లయితే వురిసిచ్చని చాటించారు. వూరంతా కూడుడికినట్లు వుడికిపోతుంది. గురువులంతా వొక కట్టుగట్టి సీసువుల్ని పిసువురాండ్లని యెగదోల్తున్నారు.
తాన్ : అయితే మీయూరిలో చాలావిశేషములు గలవు.
ముర : ఇంకా వకటండి - ఆ - మరేంగలిస్తే - మీకేమైనా పిచ్చికి వైయిద్దం తెలుసునాండి? అట్లయితే దివాణంలో కొంచెం సంభావన ముట్తుంది. గోసాయిచిట్కాలంటే అందరు నమ్ముతారు.
అగ్బ : రాణిగారి పిచ్చి కుదుర్చుటకా ?
ముర : అవునండి.
తాన్ : సంస్థానపు వైద్యులులేరా ?
ముర : ఎందుకులేరు ! వుండాడు కండోజీరావు. ఆయన రాణీగోరిని సూశి దణ్ణంపెట్టి ఈరోగానికి నాకు మందు తెలియదని వెళ్ళిపోయాడంట !
అగ్బ : ఆతఁడు వివేకి