5. "జనానా పత్రిక" 451
ఇట్టి ప్రదేశమును ప్రచారమును విడనాడుట నాకు మిగుల కష్టముగ నుండెను. తెలుఁగువారితో పోటీపడి యోడ్రవిద్యార్థులు నాకు గౌరవపూర్వకమగు వీడ్కో లొసంగిరి. విద్యార్థులు మూఁడు నాలుగు విజ్ఞాపనపత్రములును, ఒక బంగారు పతకమును సమర్పించిరి. నన్ను గుఱించి వారు నాలుగుభాషలలోను సిద్ధపఱచి చదివిన పద్యములకు నాకన్నులు చెమ్మగిల్లెను. అత్తయింటికిఁ బోవు క్రొత్తకోడలివలె కన్నీటిధారతో పర్లాకిమిడి మిత్రమండలిని వీడి, నేను విజయనగరము వెడలి పోయితిని.
పర్లాకిమిడి మిత్రులు నాబోధనాకౌశలమును, శీలప్రవర్తనములను మెచ్చుకొని, నా కాసమయమునఁ జేసిన గొప్ప సత్కార మెన్నటికిని మఱచిపోఁజాలను. వీడ్కోలు సమయమున నామిత్రులును కళాశాలా పండితులు నగు శ్రీ బంకుపల్లి మల్లయ్యశాస్త్రులుగారు చదివిన పత్రములోని యీక్రింది పద్యము, నా శీలవర్ణన విషయమున నతిశయోక్తియయ్యును, నాయాదర్శములను బట్టి స్వభావోక్తియు, రుచిరాలంకారభూయిష్ఠమునై నా లేఁత హృదయమున కమితా మోదము గలిగించెను -
"చ. కటువగు మాట లెప్పుడు ముఖంబున వెల్వడవెంచిచూడఁ ద
క్కటి వ్యసనమ్ములందగులు గానము విద్యలయందె గాక, వేం
కటశివుఁ జూచి నేర్చుకొనగాఁ దగు కాలము వమ్ము సేయకుం
డుట, దయకోపముం దన కనుంగవనే తగ నిల్పెడున్ దఱిన్ !"
5. "జనానాపత్రిక"(2)
నాకు విజయనగరమందలి యుద్యోగమగుట నామిత్రులకు, సోదరులకును నాశ్చర్య ప్రమోదములు గలిగించెను. దీనిని గుఱించి