ఈ పుట అచ్చుదిద్దబడ్డది
402
కవి యీశతకమును “సకలపురాణసంగ్రహ"మని చెప్పికొనినాఁడు. విశేషముగాఁ బద్యములలో విష్ణుమహిమను భావమును దెలుపు పురాణాంశములే కలవు. ప్రతిపద్యము రసాస్పదమై సుబోధకమగు భక్తిరసమున కాటపట్టుగ నుంటచేఁ జదువుటకుఁ జవులూరుచుండె ననుటకు సందియము లేదు.
హృదయమును ఐహికములనుండియు విషయాదులనుండియు మఱలించి భగవచ్చింతనమునకుఁ బురికొల్పుట కీశతకము ముముక్షువులకుఁ దోడ్పడఁగలదు. కవిజీవితము మానసబోధశతకమునఁ దెలుపఁబడియున్నది.
నందిగామఇట్లు భాషాసేవకులు,
1-1-25శేషాద్రిరమణకవులు