పంచమాశ్వాసము 309
“దేవ! నీవు రతులఁదేలించి ననుఁ బ్రోవు”
మనుచు వేఁడుకొనిన నబలఁ జూచి. 303
“నేను విజితేంద్రియుండను గాన సతులఁ
జెందఁగారాదు నాకుఁ బూర్ణేందువదన!
యైన నీయిష్ట మీడేరునట్టి నేర్పు
తెలియఁజెప్పెద విను”మని తెఱవకపుడు. 304
వ. కారుణికాగ్రేసరుండై యొక్క సిద్ధమంత్రంబు చెప్పి యీ మంత్రస్మరణంబున వలయునెడకుం బోయిరావచ్చుఁ గావున నీవాంఛితంబు దీనం దీర్చుకొమ్మని యానతిచ్చి మౌని విచ్చేయుడు, నంత నాకాంత యత్యంతసంతోషంబున నొంటిపాటైన సమయంబున. 305
క. ఆ రాజన్మంత్రస్మృతి
నారామముఁ జేరియున్న యపు డచ్చటికై
చేరిన తద్వనపాలుని
మారసమాకారుఁ జూచి మది ముద మొదవన్. 306
తే. ఓరచూపులఁ జిన్నెల బేరజముల
మనసుఁ గరఁగించి తనమీఁద మరులుగొలిపి
వానిఁ దోడ్కొనిపోయి యా వాలుఁగంటి
కడమయఱలోన రతికేళిఁ గలిసి చనియె. 307
క. అది మొదలు వానిఁ గవగొని
మదవతి యారామమధ్యమందిరమున నిం
పొదవఁగ రమింపఁ దొడఁగెను
మదనుఁడు విల్లెక్కుడించి మరలిచనంగన్. 308
ఉ. అంతట నొక్కనాఁటి నిశియందు శశిగ్రహణంబుగానఁ ద
చ్ఛాంతికి స్నానదానములు సల్పను వేకువజాము వచ్చు ప