బేదఱిమి నొగిలి ధనసం
పాదనమతి భద్రకాళిపాలికిఁ జనియెన్. 80
క. చని యాగుడిముందట ను
గ్రనియతిఁ దప మాచరింపఁగా నాదిమయో
గిని మెచ్చి దివ్యరూపం
బున నిలిచె న్విప్రుతలఁపుపొం దొనగూర్పన్. 81
ఉ. అత్తఱిఁ జాగి మ్రొక్కుచు ధనాఢ్యత వేఁడుట దప్పి యాత్మలోఁ
దత్తఱ మంది బ్రాహ్మణుఁడు తా నమరత్వము వేఁడినం గృపా
యత్తమనస్కయైన జగదంబిక యేకజనోపభోగ్యమౌ
క్రొత్తఫలంబు దెచ్చి యిది గొమ్మని యిచ్చిన వచ్చె నాతఁడున్. 82
క. వచ్చుట విని తన కెదురుగ
వచ్చినసతిఁ జూచి పిన్నవారలసేమం
బచ్చుపడ నడిగి యాపం
డిచ్చి యమర్త్యత్వ మిచ్చు నిది యని చెప్పెన్. 83
క. అనవుడు విని యతనికుటుం
బినియును దారిద్య్రదుఃఖపీడిత యగుటం
దనపతిఁ గడు దూఱుచు ని
ట్లనియె మనస్తాపమున నిరాకరణముగాన్. 84
ఉ. అచ్చట మెచ్చుగాంచి యిట కర్ణము దెచ్చెద వంచు నమ్మి ము
చ్చిచ్చున వెచ్చి పొట్ట కొక చేరెఁడు గంజియు లేక యాఁకటం
జచ్చియుఁ జావ మించుక విషంబయినం గొనిరాక దేవిచే
దెచ్చితి విట్టిపండు విధి ద్రిప్పఁగ ఛాందసబుద్ధి దప్పునే. 85
క. కడుపునకుఁ గూడు గానక
పడి మిడిమిడి మిడుకునట్టి బడుగున కియ్యా
పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/78
ఈ పుట ఆమోదించబడ్డది