పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

lv


క. మును దనకుం గానున్నది
   పని వడియగు నారికేళ ఫలరసముక్రియం
   జన నున్నది చనుఁ గరి గ్ర
   క్కున మ్రింగిన వెలగపండు గుంజును బోలెన్. (5-286)

“ప్రాచీదిశాంగనా ఫాలతలంబున
       దీపించు సిందూరతిలక మనఁగ" {భాగవతము)

"ప్రాచీవధూటికా ఫాలభాగంబున
      బెట్టిన కెంపుల బొట్టనంగ" (5-85)

తరువాతి వారిలో ఇతని ఛాయలు కన్పించును. మచ్చునకొక పద్యము

“కాకులలోఁ గోకిలములు
 కాకులఁ బడలేక కులము గలయఁగఁ బవనుం
 డాకుల పాటొనరింపఁగ
 నాకుల పాటయ్యె విరహులగు లోకులకున్" (7-9. సిం. ద్వా)

“ఆకులపాటుజూచి యిపుడాకులపాటొనరించె నెంతయున్" {తారాశశాంకము)

గోపరాజునకు బంధకవిత్వము మీద ప్రీతి కలదని క్రింది పద్యముల వలన తెలియుచున్నది.

సీ. రాజేంద్ర యారక్షరముల పేరిటివాఁడ
           నాద్యక్షరము మాన నశ్వవేది
   రెండక్షరములఁ బరిత్యజించిన నాట్య
           కర్త, మూడుడిపిన గతవిదుండ
   నాలుగు నుడిగింపఁ జాలనేర్పరి, నైదు
           విడిచిన బుధుఁడ నీ విధముగాత
   సర్వాక్షరంబులుఁ జదివి చూచిన బుద్ది
           బలముఁగాఁగలయట్టి ప్రౌఢుఁడనఁగ